గుంటూరు, డిసెంబరు 10, 2025:

 లోటస్ ఆద్య స్కూల్‌లో నిన్న (డిసెంబరు 9, మంగళవారం) విద్యార్థుల ఆరోగ్య అవగాహనను పెంచేందుకు ఒక ప్రత్యేక ఆరోగ్య కార్యక్రమం నిర్వహించబడింది. డాక్టర్ ఎం. శ్రీనివాస్ రెడ్డి మరియు డాక్టర్ డి. సీతారామ కిషోర్ లు ఈ ‘ఆరోగ్యకరమైన జీవనశైలి’ కార్యక్రమాన్ని నిర్వహించారు.

8వ మరియు 9వ తరగతుల చదివే సుమారు 40 మంది విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొని, ఆరోగ్యంపై విలువైన అంశాలు తెలుసుకున్నారు. వైద్యులు విద్యార్థులను ప్రత్యక్షంగా సంబోధించి, ఆహారం, శారీరక వ్యాయామం, మానసిక ఆరోగ్యం, నిద్ర యొక్క ప్రాముఖ్యత మరియు మొబైల్ స్క్రీన్ సమయ నిర్వహణ వంటి అంశాలపై సమగ్రంగా వివరించారు.

తరచుగా విద్యార్థులు ఎదుర్కొంటున్న జంక్ ఫుడ్ ఆహారం, కదలిక లేకపోవడం వంటి సవాళ్లపై దృష్టి సారించారు వైద్యులు. ఆరోగ్యకరమైన ఆహార పద్ధతులు, రోజువారీ వ్యాయామం యొక్క అవసరం, ఒత్తిడిని నిర్వహించుకోవడం మరియు సానుకూల ఆలోచనలు పెంచుకోవడంపై ప్రాధాన్యత నిచ్చారు.

డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, “చిన్న వయసులోనే ఆరోగ్యకరమైన అలవాట్లు ఏర్పరచుకోవడం భవిష్యత్తులో సంపూర్ణ ఆరోగ్యానికి పునాది. పాఠశాలలు ఈ విద్యను ప్రోత్సహించడంలో కీలక పాత్ర పోషించాలి” అన్నారు.

డాక్టర్ సీతారామ కిషోర్ కూడా, “మానసిక మరియు శారీరక ఆరోగ్యం రెండూ సమానమే. రోజుకు కనీసం ఒక గంట చొప్పున శారీరక శ్రమ, సమతుల్య ఆహారం చాలా అవసరం” అని విద్యార్థులకు సలహా ఇచ్చారు.

పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీమతి లక్ష్మీ ప్రసాద్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన వైద్యులకు కృతజ్ఞతలు తెలిపారు. విద్యార్థులు అందుకున్న జ్ఞానం వారి రోజువారీ జీవితంలో అమలు చేస్తారని ఆశించారు.

ఈ కార్యక్రమం పాఠశాలలలో ఆరోగ్య అవగాహన ప్రచారం ఎంతో అవసరమో తెలియచేసింది.

Spread the love
Avatar

By Dr. Prudhvi Raju Kakani

Dr. Prudhvi Raju Kakani MBA., MPhil., Ph.D.,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *