26 నవంబర్ 2025 గుంటూరు:

 ఆరోగ్య భారతి  గుంటూరు ఆధ్వర్యంలో శ్రీ మాజేటి గురవయ్య హైస్కూల్‌లో స్కూల్ హెల్త్ ప్రోగ్రామ్ శనివారం విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హెడ్మిస్ట్రెస్ శ్రీమతి శారదా దేవి సక్రియ సహకారం అందించారు. మొత్తం 180 మంది విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

కార్యక్రమ ప్రధాన వక్తగా ఆరోగ్యం భారతి  గుంటూరు ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ కాకాని  పృథ్వీ  రాజు పాల్గొని విద్యార్థులకు ఆరోగ్యంపై అవగాహన కల్పించారు.

డాక్టర్ పృథ్వీ రాజు మాట్లాడుతూ ఆయుర్వేద వైద్య విధానంలో భగవాన్ ధన్వంతరి ప్రాముఖ్యత, ఆయన ఆరోగ్య వ్యవస్థకు అందించిన దైవిక మార్గదర్శనం గురించి వివరించారు. అనంతరం ఆయన విద్యార్థులతో ఆరోగ్యకరమైన జీవనశైలి, రోజువారీ శారీరక వ్యాయామాలు, సరైన ఆహారపు అలవాట్లు గురించి ఇంటరాక్టివ్ సెషన్ నిర్వహించారు.
స్వచ్ఛమైన అలవాట్లు పాటించకపోతే శరీరం, మనసు, భవిష్యత్తు పై కలిగే ప్రతికూల ప్రభావాలను కూడా వివరించారు.

తరువాత డాక్టర్ శ్రీనివాస రెడ్డి విద్యార్థులకు యోగ ప్రాముఖ్యత వివరించారు. యోగ మనసు, బుద్ధిని సమతుల్యంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు. ఆయన విద్యార్థులకు యోగాసనాలు ప్రాక్టికల్‌గా చూపించి సాధన చేయించారు.

చివరగా హెడ్మిస్ట్రెస్ శ్రీమతి శారదా దేవి ముగింపు సందేశం ఇచ్చి, ఆరోగ్య భారత్ నిర్వహించిన ఈ కార్యక్రమం విద్యార్థుల్లో ఆరోగ్య అవగాహన పెంపొందించడంలో ఎంతో ఉపయోగకరమని అభినందించారు.

ఈ కార్యక్రమం విద్యార్థుల్లో ఆరోగ్య స్ఫూర్తిని నింపుతూ విజయవంతంగా ముగిసింది.

Spread the love
Avatar

By Dr. Prudhvi Raju Kakani

Dr. Prudhvi Raju Kakani MBA., MPhil., Ph.D.,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *