వ్యసన విముక్తి కార్యాచరణపై జాతీయ స్థాయి బృందం దృష్టి: ఆరోగ్య భారతి

వ్యసన విముక్తి కార్యక్రమాలను సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లేందుకు జాతీయ స్థాయి బృందం నేడు జరిగిన ఆన్లైన్ సమావేశములో పలు  కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ సందర్భంగా డా.సంజీవన్ గారిని కేంద్ర బృందంలో చేర్చాల్సిన అవసరాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు. ఆయనకు వివిధ రాష్ట్రాలలో పని చేసిన అనుభవం ఉండటంతో, బృందానికి మార్గదర్శకత్వం అందించగలరని అభిప్రాయపడ్డారు.

ఈ సమావేశంలో వ్యసన విముక్తి కార్యక్రమం విస్తృతమైనదని, ప్రభుత్వ బాధ్యతలను స్వీకరించకుండా అవగాహన కల్పించడం, ప్రజలకు ప్రేరణ ఇవ్వడం, మరియు సాధారణ సూచనలు అందించడం వంటి పనులపై దృష్టి పెట్టాలని  నిర్ణయించారు. ముఖ్యంగా యువతను వ్యసనాల నుంచి దూరంగా ఉంచేందుకు చర్యలు తీసుకోవాలని డాక్టర్ అశోక్ వర్షినే అఖిల భారత సంఘటన్ సచివ్  పేర్కొన్నారు.

వ్యసనం కేవలం మాదకద్రవ్యాలకు మాత్రమే పరిమితం కాకుండా ఇతర రకాల వ్యసనాలను కూడా పరిగణలోకి తీసుకోవాలని నిర్ణయించారు. ఈ అంశాలపై సాహిత్యం, వీడియోలు, ప్రదర్శనలు రూపొందించాలని సూచించారు.

ప్రతి ప్రావిన్స్‌లో బృందాలను ఏర్పాటు చేసి, వారి పనితీరును అంచనా వేసేందుకు ప్రమాణాలు రూపొందించాల్సిన అవసరాన్ని వ్యక్తం చేశారు. గ్రామాలు, పాఠశాలలు, కార్యాలయాలలో నిరంతర కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.

పునరావాస కేంద్రాలను నడపడం సాధ్యం కాకపోయినా, ఆ రంగంలో నిపుణులతో అనుసంధానం కావాలని సూచించారు. అలాగే విజయవంతమైన కార్యక్రమాలను సేకరించి ప్రచారం చేయాలని నిర్ణయించారు.

ఇంకా కొన్ని రాష్ట్రాల నుంచి కార్యకర్తలను చేర్చుకోవాల్సి ఉందని, దీనివల్ల బృందం మరింత బలోపేతం అవుతుందని అభిప్రాయపడ్డారు. వివిధ ప్రాంతాల్లో ప్రత్యేక వర్క్‌షాప్‌లు నిర్వహించడం ద్వారా కార్యక్రమాన్ని విస్తరించేందుకు ప్రణాళికలు రూపొందించారు.

Spread the love

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top